తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా సరే కాంగ్రెస్ … బిజెపి అధికారంలోకి రావటానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక టిడిపి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటికి రావటం, కొన్ని పరిణామాలు దృష్ట్యా తెలంగాణలో పోటి చేయడం లేదని ప్రకటించింది. అయితే ఇప్పుడు టిడిపిలో ఉన్న వాళ్లంతా ఏపార్టీకి మద్దతు ఇస్తారో అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. టిడిపి పోటీ చేయకపోతే ఆపార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆసక్తి అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో టిడిపికి చాలా బలం ఉంది. 2014లో టిడిపి మల్కాజిగిరి ఎంపీ స్థానంతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. 2018లోనూ రెండు ఎమ్మెల్యేలు సీట్లు గెలుచుకుంది. రంగారెడ్డి, నిజమాబాద్,. ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రాంతాలలో ఆ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి అభిమానులు ఇతర పార్టీలో చేరతారా, లేకపోతే అదే పార్టీ మీద అభిమానంతో అలానే ఉంటారో చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో టిడిపి ఏపార్టీ వైపు మొగ్గు చూపుతోందో అందరికి అది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలింది.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం జనసేన టిడిపిని దూరంగా పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పొత్తుని ఏర్పరచుకున్నది. కాబట్టి తెలంగాణలో టిడిపి ఓట్లను జనసేన రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బిజెపి కూడా టిడిపి ఓట్లు బ్యాంకును తనవైపుకు ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన పొత్తుగా పోటీ చేస్తున్నాయి.కాబట్టి తెలంగాణలో జనసేన తమకే టిడిపి మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ పూర్తిగా భానిస్తున్నారు. బీజేపీ కూడా టిడిపి మద్దతు ఇస్తుందని పూర్తి సంపూర్ణంగా ఉన్నారు. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తోందని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే కమ్మ సంఘం నేతలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రేవంత్ చంద్రబాబుకి సన్నిహితుడు కాబట్టి టిడిపి ఓట్లు కాంగ్రెస్ కి వెళ్తాయని కొంతమంది భావిస్తున్నారు.
బాబు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాదులో ఆందోళనకు పర్మిషన్ ఇవ్వకపోవడం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వరని కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు టిడిపి సానుభూతుల ఓట్లు తెలంగాణ రాజకీయాలలో కీలకమయ్యాయి ఎన్నికలలో టిడిపి పాల్గొనకపోయినా ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది .
Discussion about this post