TDP అధినేత , AP మాజీ సీఎం చంద్ర బాబు అరెస్ట్ నేపధ్యం లో లోకేష్ ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవటం చర్చనీయాంశమైంది … పై గా రాజకీయంగా ఇటీవల BJP కి టీడీపీ కి నడుమ విభేదాలు నడుస్తున్నట్టు బాహాటం గా బయట పడక పోయినప్పటికీ అంతర్గతంగా నడుస్తోందని అందుకే జగన్ ఆడింది ఆటా పాడింది పాటగా ఉందని ప్రజల భావన …అదేం లేదు గతం లో టీడీపీ MP లను BJP లో విలీనం చేయటం వల్ల టీడీపీ , బీజేపీ ల బంధం అలాగే కొనసాగుతోందని కొందరి వాదన …. అరెస్ట్ జరిగిన చాలా రోజుల తరువాత ఈ సమావేశం జరగటం మరింత చర్చకు దారి తీస్తోంది …. అరెస్ట్ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జగన్ పై విమర్శలు గుప్పించటం రాజకీయం గా ఒక ఎత్తయితే … చంద్ర బాబు కుటుంబ సభ్యురాలి గా తన పాత్ర పోషించి టీడీపీ వర్గాల్లో మంచి మార్కులు కొట్టారు పురంధేశ్వరి… కానీ కేంద్రం నుంచి ఏవిధమైన చలనం కనపడక పోవటం తో … జగన్ ను తెరవెనుక నుంచి కేంద్ర బీజేపీ పెద్దలే నడిపించారనే టాక్ కూడా నడిచింది …
కేంద్రం లో బీజేపీ అధికారం లో ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో కేడర్ మరీ బలహీనం గా ఉండి ప్రాంతీయ పార్టీల పై ఆధార పడవలసి వస్తోంది . తెలంగాణాలో కూడా అంతంత మాత్రమైన కేడర్ తో నెట్టు కొస్తోంది . రానున్న ఎన్నికల నేపథ్యం లో పవన్ కళ్యాణ్ బలంగా టీడీపీ ని బలపరచడం కూడా ఒక ప్రధాన అంశం . తెలంగాణలో కెసిఆర్ TRS ను BRS గా మార్చి జాతీయ స్థాయిలో నేతలను సమీకరించటం BJP కి కొరుకుడు పడని విషయమే … తెలంగాణా లో MIM బీజేపీ కి పూర్తి వ్యతిరేక భావాలున్న పార్టీ … మరొక బలమైన పార్టీ లేకపోవటం , కొత్తగా రంగప్రవేశం చేసిన షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం …వెరసి టీడీపీ తో పొత్తు తప్పని సరవుతోంది … పైగా ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువ గా ఉండటం … అందులో ఎక్కువ శాతం TDP కి అను కూలం గా ఉండటం తో టీడీపీ కి BJP స్నేహ హస్తం అందించటం తప్పని సరి అవుతోంది …
అమిత్ షా తో లోకేష్ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశీసులు మెండుగా వున్న కిషన్ రెడ్డి హాజరవటం ఆలోచించ తగ్గవిషయం … అంచెలంచెలు గా బీజేపీ లో ఎదిగిన పురంధేశ్వరి ఒక్కరే షా తో లోకేష్ కి సమావేశం ఏర్పాటు చేయవచ్చు . అలా కాక కిషన్ రెడ్డి , పురంధేశ్వరి , లోకేష్ లు కలసి కేంద్రం లో మోడీ తరువాత నెంబర్ టూ గా ఉన్న అమిత్ ను కలవటం లో చంద్ర బాబు అంశం మాత్రమే కాకుండా … తెలంగాణా లో రాబోయే ఎన్నికలలో పొత్తుల గురించి , గెలిస్తే ఇవ్వాల్సిన మద్దతు గురించి షా లోకేష్ తో చర్చించారు . ఆంధ్రా లో జగన్ విషయం పక్కన పెడితే తెలంగాణా లో KCR తో ఫైటే BJP టఫ్ గా భావిస్తోంది .
కేడర్ పరం గా కొద్దో గొప్పో ఇమేజ్ ఉన్న టీడీపీ సపోర్ట్ తో తెలంగాణా లో జండా పాతాలనే ఊహ బీజేపీ కి ఓ మధుర స్వప్నం .గతంలో ఈ రెండు పార్టీల పొత్తుల తో ప్రభుత్వాన్ని నడిపిన హిస్టరీ ఉంది కాబట్టి చంద్ర బాబు అంశానికి , పొత్తులకు ముడిపెట్టి కేడర్ పరం గా కొద్దో గొప్పో ఇమేజ్ ఉన్న టీడీపీ సపోర్ట్ తో తెలంగాణా లో జండా పాతాలనే ఊహ బీజేపీ కి ఓ మధుర స్వప్నం .గతంలో ఈ రెండు పార్టీల పొత్తుల తో ప్రభుత్వాన్ని నడిపిన హిస్టరీ ఉంది కాబట్టి చంద్ర బాబు అంశానికి , మద్దతుకు ముడిపెట్టి BJP తెలంగాణా లో తన పబ్బం గడుపు కోవాలని అనుకుంటోందని భావించ వచ్చు.
Discussion about this post