కేటీఆర్ అరెస్ట్ కేసు: హైకోర్టు తీర్పు, తదుపరి పరిణామాలు
తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ ఒకటి. కేటీఆర్ అరెస్ట్ కేసు ,ఈ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదని ఏసీబీకి స్పష్టం చేసింది. అయితే కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీనితో, పది రోజులపాటు కేటీఆర్కు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.
కేసు వివరాలు:
ఫార్ములా ఈ కార్ రేస్కు అనుమతులు లేకుండానే హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో రూ.46 కోట్ల చెల్లింపులు జరగడం వంటి ఆరోపణలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ను ఏ1గా, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ జీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొన్నారు.
గవర్నర్ అనుమతి లభించాక, ఏసీబీ కేటీఆర్పై కేసు నమోదు చేసింది. దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో వాదనలు:
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సుందరం తదితరులు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, ఎఫ్ఐఆర్ దర్యాప్తు కోసమేనని, నిబంధన ఉల్లంఘనల వివరాలు దర్యాప్తులో తేలుతాయని తెలిపారు. కోర్టు ఈ వాదనలు పరిశీలించి, కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది.
ఈడీ ప్రవేశం:
ఇటీవల ఈ కేసులో ఈడీ కూడా ప్రవేశించింది. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఈడీ కేసు నమోదు చేసింది.
రాజకీయ ప్రభావం:
ఈ వ్యవహారం అసెంబ్లీలో కూడా హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ దీనిపై చర్చ కోరగా, స్పీకర్ స్పందిస్తూ, ఇప్పుడే ఏసీబీ విచారణ జరుగుతోందని, సభలో చర్చ అవసరం లేదన్నారు.
తాత్కాలిక ఉపశమనం:
హైకోర్టు తీర్పుతో కేటీఆర్కు తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ, డిసెంబర్ 27న హైకోర్టు తీర్పు ఏమిటి? 31న కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అనే ప్రశ్నలు ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ అరెస్ట్ కేసు.
మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి : 4Sides Tv.
Discussion about this post