కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.. కరోనా పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకోస్తోంది ఎవరికైనా. ముఖ్యంగా కరోనా పుట్టినిల్లు చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న దేశం అది. పైగా చాలా ఏళ్ల పాటు కరోనా మహమ్మారి ఆ దేశాన్ని ఓ పట్టాన వదల్లేదు. ఇప్పుడూ తాజాగా మళ్లీ కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు గురించి వస్తోన్న వార్తలు గుబులు రేపుతున్నాయి.
సాక్షాత్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే మీడియా మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు.దీంతో ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లాంటి వైరల్ వ్యాధి ప్రబలంగా ఉంది. ఈ వ్యాధి బారిన ఎక్కువగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు అంటున్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్లు లేవని జబ్బున పడిన పిల్లలతోనే ఆస్పత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు.
కరోనా ఆంక్షలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్లు సమాచారం. ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని డబ్ల్యూహెచ్ఓ చైనా అధికారులను కోరింది. కోవిడ్-19 రూపాంతరం సార్క్ కోవిడ్-2.. ఇన్ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లు కరోనా మహమ్మారి ప్రారంభంలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇప్పుడు చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉండటంతో చైనా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడ జ్వరానికి సంబంధించిన కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలను హెచ్చరించారు. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లు అధికమైనాయి. అయితే ఈ వైరల్ ఫీవర్లు బారిన పిల్లలు, పెద్దలు పడటమే గాక అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించమని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
























Discussion about this post