తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల విమర్శలు – ప్రతివిమర్శల జోరు పెరిగింది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి.ఈక్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న క్రికెటర్ అజారుద్దీన్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడిగా మహ్మద్ అజారుద్దీన్ విఫలమయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అజారుద్దీన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూనే.. అతనిపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థిని పోటీ చేయించడాన్నిఓవైసీ సమర్థించుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ‘తెలంగాణ రౌండ్ టేబుల్’ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ నుంచి తొలిసారిగా MIMఅభ్యర్థిని నిలబెడుతోంది. అందుకు కారణం మాజీ క్రికెటర్పై ‘వ్యక్తిగత శత్రుత్వం’ అనే వాదనలను హైదరాబాద్ ఎంపీ తిరస్కరించారు. “అజారుద్దీన్ ఇద్దరు తమ్ముళ్లు నాకు చాలా మంచి స్నేహితులు.జూబ్లీహిల్స్లో, మాకు ఇద్దరు మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. మాపార్టీ కి బలం ఉంది’ అంటూ అసదుద్దీన్ వివరించారు.
2009లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి లోక్సభ ఎంపీగా పనిచేసిన అజారుద్దీన్ను గుర్తు చేస్తూ.. అజార్ “రాజకీయ నాయకుడిగా విఫలం” అంటూ ఓవైసీ అభివర్ణించారు. “క్రికెట్ బ్యాట్తో అతను వండర్స్ చేశాడు. ఆ మణికట్టు షాట్లు చూడటానికి అద్భుతంగా ఉంటాయి” .. అన్నారు. జూబ్లీహిల్స్లో పోటీకి దిగాలన్న ఎంఐఎం ఆలోచన ముస్లిం ఓట్లను చీల్చడానికి అనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్లో 1,17,972 మంది మైనారిటీ కమ్యూనిటీ ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను నిలబెట్టాయి..ఎంఐఎం కూడా ఇక్కడ పోటీకి దిగడంతో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ అజారుద్దీన్ను,ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ను బరిలోకి దించగా, బీఆర్ఎస్ మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి ఎల్.దీపక్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014..2018..లోను మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 న జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
Discussion about this post