ఇండియా పాకిస్థాన్ తలపడుతున్నాయి అంటే అది ఏ ఆట అయినా సరే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి గా చూస్తుంటారు .ఇక క్రికెట్ అంటే ఆ క్రేజ్ చెప్పక్కర్లేదు .వన్ డే వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్థాన్ తలపడుతున్నాయి అంటే క్రికెట్ ఫీవర్ వచేసినట్టే …ఎందుకంటే అహ్మదాబాద్ లో రేపు జరగపోయే ఇండియా పాకీస్థాన్ మ్యాచ్ కి హోటళ్లలో బస దొరక్కపోతే హాస్పిటల్ లో కూడా జాయిన్ అవుతున్నారట ఎదో ఒక నెపం తో …అంత క్రేజీ మ్యాచ్ చూడబోయే ముందు ఈ వరల్డ్ కప్ లో ఇంతకు ముందు ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ ల పై ఓ లుక్ వేద్దాం ..
చిరకాల ప్రత్యర్థులు ఇండో-పాక్ మ్యాచ్ ఫీవర్ అహ్మదాబాద్ను కమ్మేసింది. ఈ పోరు ను వీక్షించడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంతో తరలి వస్తున్నారు. చాలారోజుల తరువాత పాకిస్థాన్ ఇండియా లో ఇండియా తో ఆడటం స్పెషల్ . ఇండియా పాకిస్థాన్ లు వన్ డే ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు అంటే 1992, 1996 ,2003 , 2011 , 2015 మరియు 2019 లో తలపడ్డాయి.ఈ ఏడుసార్లు భారత్ దాయాది పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది . 1992 లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా 43 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది . ఈ మ్యాచ్ లో బాటింగ్ లో సచిన్ ,అజయ్ జడేజా, కపిల్ దేవ్ రాణించగా బౌలింగ్ లో కపిల్ దేవ్ , మనోజ్ ప్రభాకర్ ,జవగల్ శ్రీనాథ్ లు రాణించారు . 1996 లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 39 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై విజయం నమోదు చేసింది .నవజ్యోత్ సింగ్ సిద్దు ,అజయ్ జడేజా బాటింగ్ లో చెలరేగగా బౌలింగ్ లో వెంకటేష్ ప్రసాద్ ,అనిల్ కుంబ్లే అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు .1999 ప్రపంచ కప్ లో ఇండియా పాకిస్థాన్ లు తల పడిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది .సచిన్ ,రాహుల్ ద్రావిడ్ ,అజహరుద్దీన్ బాటింగ్ లో రాణించగా వెంకటేష్ ప్రసాద్ 27 పరుగులకే 5 వికెట్ లు సాధించి విజయం లో కీలకపాత్ర పోషించాడు . 2003 లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో సచిన్ రాణించడం తో పాకిస్థాన్ పై మరల విజయం సాధించింది .
ఈ మ్యాచ్ లో సచిన్ త్రుటి లో సెంచరీ మిస్ చేసుకున్నాడు . 2007 లో ఇండియా గ్రూప్ దశలోనే వెనుదిరగడం వాళ్ళ ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరుగ లేదు . 2011 లో మొహాలీ వేదికగా ఇరుదేశాలు తలపడ్డాయి . సెమీఫైనల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టీం ఇండియా సమిష్టిగా రాణించి పాకిస్థాన్ ని ఓడించింది .అంతే కాదు ఫైనల్ లో శ్రీలంక ను ఓడించి రెండవ సారి వరల్డ్ కప్ సాధించింది . 2015 లో అడిలైడ్ వేదికగా ఇరుజట్లు తలపడగా విరాట్ కోహ్లీ ,శిఖర్ ధావన్ ,సురేష్ రైనా లు బాటింగ్ లో రాణించారు.షమీ బౌలింగ్ లో చెలరేగి పాకిస్థాన్ ని ఓడించడం లో కీలక పాత్ర వహించాడు . 2019 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్థాన్ లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లు వీరవిహారం చేయగా ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది . వర్షం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలుగడం తో డక్ వర్త్ లూయిస్ పద్ధతిన ఇండియా విజయం పొందింది .కాగా స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచింది. ఇప్పుడు శనివారం నాడు అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో పోరుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు టీమిండియా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే అందరి దృష్టి స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్పైనే పడింది. అతడు డెంగీ జ్వరం బారిన పడి కోలుకుని చెన్నైలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అంతేకాకుండా చెన్నై నుంచి అహ్మదాబాద్ చేరుకున్నాడు. దీంతో అతడు పాకిస్థాన్తో మ్యాచ్లో బరిలోకి దిగుతాడని అభిమానులు భావిస్తున్నారు. సొంతగడ్డపై సూపర్ ఫామ్లో ఉన్న గిల్ ఆడితే టీమిండియాకు బెనిఫిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో గిల్ ఆడటంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతే కాదు దాయాదుల పోరు జరిగే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ సంగీత కచేరీ ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.
Discussion about this post