రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ రైతులు అధైర్య పడొద్దని…ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందని చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడానికి 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే డబ్బులు కూడా చెల్లిస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడానికి 7245 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో 7142 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి ఇప్పటి వరకు 40 లక్షల టన్నుల ధాన్యాన్నిసేకరించడం జరిగిందని సేకరించిన ధాన్యానికి కేవలం 3 రోజుల వ్యవధిలోనే డబ్బులు చెల్లించేస్తూ మిగతా రైతుల విషయంలోనూ అలాగే 3 రోజుల్లోనే డబ్బులు రైతులకు అండ్ విధంగా ఏర్పాటు చేశామని పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
ఈ రోజు సోమాజీగూడా లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతుల పండించే ప్రతి ధాన్యం గింజకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి అపోహలకు గోరి కావద్దుని, అలాగే రైతులకు అపోహలు కలిగించే విధంగా వచ్చే వార్తలను నమ్మవద్దని చౌహాన్ తెలిపారు.
అదే విధంగా వార్తలు ప్రసారం చేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో రైతులు అయోమయానికి గురి చేసే విధంగా వార్తలు రాయద్దని ప్రసారం చేయద్దని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చే ధాన్యం సేకరించడంతో పాటు వచ్చే పంట నుండి వచ్చే ధాన్యం అంటే 40 నుండి 50 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అని చౌహన్ తెలిపారు.
Discussion about this post