లోక్సభ ఎన్నికల వేళ.. అస్సాంలోని తేజ్పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్ గ్రామం వార్తల్లో నిలిచింది. ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లె బాటపట్టారు. కారణం.. ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
రాన్ బహదూర్ అనే గోర్ఖా సోనిత్పూర్ జిల్లాలో స్థిరపడి…. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అతడికి ఐదుగురు భార్యలు. 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు కాగా… 1997లో ఆయన మరణించారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో దాదాపు 2,500 మంది సభ్యులు ఉండగా…వారిలో ఓటర్లు 1,200 మంది. వీరంతా కుటుంబ పెద్దలు ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేస్తారు. దీంతో తేజ్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఈ గ్రామ పెద్దలతో, ముఖ్యంగా రాన్ బహదూర్ థాపా పెద్ద కుమారుడు, ప్రస్తుత గ్రామాధిపతి టిల్ బహదూర్ థాపాతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారు. మా నాన్న ఐదుసార్లు పెళ్లి చేసుకున్నారు. మేం 22 మంది పిల్లలం. ఒకే ఇంట్లో ఉండటం కష్టంగా ఉండటంతో విడిగా జీవిస్తున్నామని, ఇప్పుడు 300 కుటుంబాలు ఉన్నాయని, మాకు 65 మంది మనవళ్లు, 70 మంది మనవరాళ్లు ఉన్నారని గ్రామాధిపతి టిల్ బహదూర్ చెప్పారు.
Discussion about this post