అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ ఆధ్యర్యంలో ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం నగరంలోని NST రోడ్ శ్రీ సీతా రామ ఆంజనేయ ఆలయం వద్ద ప్రారంభమయిన శోభాయాత్ర నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. అంతకుముందు బిజెపి నేతలు ఆలయాన్ని శుభ్రంచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సెక్రటరీ యాదగిరి రెడ్డి …బాల రాముడి ప్రతిష్ఠతో దేశం సుభిక్షంగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Discussion about this post