భారత నౌకాదళంలో మరో మూడు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌకలు చేరాయి. వీటి చేరికతో భారత నేవీ మరింత బలోపేతమైంది. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించే ఈ యుద్ధ నౌకలు నేవీ చేతికి అందాయి. కొచ్చి షిప్యార్డ్లో మొత్తం ఎనిమిది నౌకలు తయారవుతున్నాయి. వీటిలో ముందుగా తయారైన మూడు నౌకలు ఐఎన్ఎస్ మహె, ఐఎన్ఎస్ మల్వాన్, ఐఎన్ఎస్ మాంగ్రోల్లను నేవీ అధికారులు ప్రారంభించారు.
ఈ ASW నౌకలో తేలికపాటి టార్పిడోలు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో వినియోగించే రాకెట్లు, మైన్స్, 30 ఎంఎం గన్స్, 12.7 ఎంఎం స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్ ఉన్నాయి. ఒక్కోనౌక 78 మీటర్ల పొడవుతో, 11.36 మీటర్ల వెడల్పుతో 896 టన్నుల బరువుంటుంది. ఇవి గంటకు 45 కి.మీ. వేగంతో.. ఏకబిగిన 1800 నాటికల్ మైళ్లు ప్రయాణించగలవు. శత్రువుల సబ్మెరైన్ లను అధునాతన సెన్సర్ల సహాయంతో గుర్తించి వాటిని సమూలంగా నాశనం చెయ్యడం వీటి ప్రత్యేకత.
హిందూ మహాసముద్రంపై చైనా కన్ను పడింది. ఈక్రమంలో చైనా భూమి, ఆకాశంతో పాటు సముద్రంలో కూడా బలం పెంచుకుంటోంది. దీంతో భారతదేశం కూడా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. సముద్రంలో తన శక్తిని పెంచుకోవడానికి, నావికాదళానికి శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చాలని భారతదేశం ప్లాన్ చేసింది. చైనా, పాక్ వంటి శత్రు దేశాలను ఎదుర్కోవడానికి సన్నద్దమయ్యింది. దీని కోసం భారతదేశం తన నౌకాదళంలో అనేక కొత్త జలాంతర్గాములను చేర్చడం ద్వారా సైన్యం పరికరాలను ఆధునీకరిస్తోంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి ముఖ్యమైనది. చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాల నౌకలను గుర్తించి, వాటిని సమూలంగా నాశనం చెయ్యడానికి ఇవేంతో కీలకంగా మారనున్నాయి. నౌకాదళంలో ప్రస్తుతం ఉన్న అభయ్ క్లాస్ ASW కార్వెట్స్ స్థానాన్ని ఇవి భర్తీ చేయనున్నాయి. తీరప్రాంతాల్లో పాక్ ..చైనా చేపట్టే కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు , తక్కువ సముద్ర తీవ్రత కలిగిన కార్యకలాపాలను, ఉపరితల నిఘా వ్యవస్థలను పసిగట్టడం, యుద్ద విమానాలతో సమన్వయం, సెర్చ్… రెస్క్యూ మిషన్లను నిర్వహించడం వీటి ప్రత్యేకత.
వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వైస్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ, ఇండియన్ నేవల్ అకాడమీ వైస్ అడ్మిరల్ పునీల్ భల్ వారి సతీమణులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో ఎనిమిది ASW నౌకల నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ కొచ్చి షిప్యార్డ్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే నేవీలో ఉన్న అభయ్ శ్రేణి ASW ల స్థానాన్ని ఈ నౌకలు భర్తీ చేయనున్నాయి. తీరప్రాంతాల్లో యాంటీ సబ్బెరైన్ ఆపరేషన్లకు, ఉపరితల నిఘాకోసం వీటిని ఉపయోగించనున్నారు.
Discussion about this post