ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం వెల్లడించింది. ఆగస్టు-సెప్టెంబరు మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారత్లో సాధారణం కంటే అధికంగానే వానలు పడతాయని ఇప్పటికే భావిస్తుండగా తాజా అంచనాలు వాటిని మరింత బలపరుస్తున్నాయి. 2024 నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయి. అయితే కొన్ని ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే కొంచెం తక్కువ వానలు పడతాయి అని ఎస్ఏఎస్సీవోఎఫ్ తెలిపింది. ఎస్ఏఎస్సీవోఎఫ్ తాజా అంచనాలను ఈ ప్రాంతంలోని తొమ్మిది వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి. ఇందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని తీసుకున్నాయి.
Discussion about this post