విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ ,జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ కూటమి ఎంపీ అబ్యర్ధి భరత్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు, టీడీపీ,జనసేన, బీజేపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ కు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. పొత్తు గెలవాలి.. పాలన మారాలన్న నినాదంతో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి.. విశాఖకు సాగు తాగు నీరు తీసుకువస్తామని అన్నారు.
Discussion about this post