ప్రభుత్వం స్పందించకపోవడంతో వినూత్న నిరసన
అంగన్వాడీ కార్యకర్తలు దున్నపోతుకు తమ డిమాండ్ పత్రాన్ని అందించి వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 22 రోజులుగా తాము నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని… ప్రభుత్వ తీరుకు నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గౌరవ వేతనం వద్దు.. కనీస వేతనం కావాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
Discussion about this post