ఆరు గ్యారెంటీల అమలుకు సమాయత్తం కండి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం కావాలని మంత్రులు దామోదర రాజ నర్సింహ, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంత్రి దామోదర రాజానర్సింహ మాట్లాడుతూ పథకాల రూపకల్పన, విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు.
Discussion about this post