నారాయణపేట లింగయ్య స్వామి ఆలయంలో శివ స్వాములపై తేనెటీగలు దాడి చేశాయి. శివ మహా పడి పూజ సందర్భంగా స్వాములకు అన్నదానం చేసేందుకు వంటలు వండుతున్న సమయంలో పొగలు వ్యాపించి చెట్టుకు ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా స్వాములపై దాడులు చేశాయి. సుమారు 30 మంది స్వాములపై దాడి చేయగా వారందరు జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు తీసుకున్నారు. స్వాములకు ఎలాంటి ప్రమాదం లేదని అందరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పడి పూజ ఉండటంతో పెద్ద సంఖ్యలో శివ స్వాములు పూజకు హాజరయ్యారు.
Discussion about this post