బి ఆర్ ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.కాంగ్రెసులోకి బి ఆర్ ఎస్ పార్టీ నేతల వలసల పరంపర కొనసాగుతుంది .తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అధికార పార్టీలోకి చేరిపోయారు . ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్కుమార్కు టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Discussion about this post