బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు చెప్పారు. విశాఖపట్నంలోని పౌర గ్రంధాలయంలో ఉత్తరాంధ్ర బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పనికిమాలిన రాజకీయలు నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు కులస్వామ్యమని విమర్శించారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజిక వర్గాల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.రానున్న ఎన్నికలలో ప్రజలు అప్రమత్తంగా వ్యవరించాలని కోరారు.
Discussion about this post