దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం జరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో పదవికి థియరీ డెలాపోర్ట్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఏప్రిల్ 6 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే మే 31 వరకు కంపెనీ బాధ్యతల్లో కొనసాగుతారని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో విప్రో పేర్కొంది. 2020 జులైలో విప్రో సీఈవోగా థియరీ డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫ్రెంచ్ ఐటీ కంపెనీ క్యాప్జెమినీలో పనిచేసిన ఆయన రూ.80 కోట్ల వార్షిక వేతనంతో విప్రోలో రికార్డు సృష్టించారు. కాగా విప్రో కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్ పల్లియాను నియమించినట్లు విప్రో ప్రకటించింది.
Discussion about this post