మెదక్, మహబూబ్ నగర్ లలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ CSI చర్చిలో ఉదయం 4.30 గంటల మొదటి ఆరాధన, ప్రత్యేక ప్రార్థనల తో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర దేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసు శాఖ చర్చి ఆవరణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్ని చర్చిలు రాత్రి నుండి విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోయాయి. ఉదయం చర్చిలలో ఆరాధన, గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ పండగ సందర్భంగా ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఎంబీసీ చర్చిలో పాస్టర్ చిరంజీవి క్రీస్తు సందేశం ఇచ్చారు . క్రిస్టియన్ పల్లి లోని క్రీస్తు జ్యోతి దేవాలయాన్ని ఒరిస్సా రాష్ట్రం భక్తులు దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ క్రీస్తు జ్యోతి దేవాలయం.
Discussion about this post