ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోందని, సీఎం జగన్ మొండితనంతో వ్యవహరిస్తున్నారని సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లయినప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఆరు దఫాలు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది అసంఘటిత కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది మొండితనం అంటున్న నరసింగరావు
Discussion about this post