సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన సీఎం జగన్
కడప జిల్లా బద్వేలు మండలంలోని గోపవరంలో సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేశారు. దీంతో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించి, 25 వేల మంది రైతు కుటుంబాలకు పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది. 80 వేల ఎకరాల్లో జామాయిల్ చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందించి, ఇప్పటికే సబ్సిడీ ధరకు 50 లక్షల మొక్కలు పంపిణీ చేశారు.. ఈ యూనిట్ కు అనుబంధంగా నాయుడు పేటలో రెసిన్ యూనిట్ ను ప్రారంభిస్తారు.
Discussion about this post