దేశంలో పసుపు రైతుల మొహాల్లో ఇప్పుడిప్పుడే ఆనందం కనబడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అంకుశాపూర్ చెందిన రాజు అనే రైతు పండించిన పసుపు 17 వేల 503 రూపాయలు, అదే గ్రామానికి మహేష్ అనే రైతుకు అదే మార్కెట్లో 18 వేల 900 రూపాయల ధర పలకడం ఆనందం కలిగించిందని అన్నారు. గతంలో లేని విధంగా పసుపు ధరలు పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. క్వింటాలు పసుపుకు 20 వేల రూపాయలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
Discussion about this post