లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ముందు రోజే తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఉత్కంఠం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మణుగూరు ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ… బీజేపి కుట్రపూరితంగా… విచారణ పేరుతో అక్రమ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన పద్ధతి కాదని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే… ఈడి కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్పారు.
Discussion about this post