సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున రాజకీయ పక్షాలను కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మార్చి 16 నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. జూన్ 6 వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి రాజకీయ పార్టీ నడుచుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ మల్లిఖార్జున స్పష్టం చేశారు.
Discussion about this post