సురక్షితమైన, స్వేచ్ఛా, శాంతియుత ఎన్నికలను నిర్వహించుదామని సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దీనిలో పోలీసులు, విక్రాంత్ సింగ్ ట్రైనీ ఐపీఎస్ లు, సీఆర్పీఎఫ్ 58 బెటాలియన్, ఇన్ స్పెక్టర్ జేఎన్ రాజులు పాల్గొన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పౌరుడు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకుగాను పోలీసు, కేంద్ర బలగాల సహకారం పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు.
Discussion about this post