అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గీతాంజలి సినిమా కంటే గీతాంజలి మళ్లీ వచ్చింది మళ్లి వచ్చింది సినిమా ప్రేక్షకులను మరింతగా అలరిస్తుందని హీరోయిన్ అంజరీ, రైటర్ కోన వెంకట్ తెలిపారు.
Discussion about this post