నెల్లూరులో చారిత్రికంగా సాగుతోన్న రొట్టెల పండుగ జులై 17 నుంచి నిర్వహించే కార్యాచరణను జిల్లాకు చెందిన వక్ఫ్ బోర్డు పెద్దలు, మంత్రులు ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లకు ఉపక్రమించినట్లు నెల్లూరు ఆర్టీఓ మలోలా తెలిపారు. రొట్టెల పండుగ విశేషానికి వేధికైన స్వర్ణాల చెరువు, బారాషాహిద్ దర్గా ప్రాంగణం కార్పోరేషను ఆధీనంలో పారిశుధ్యం , స్టాల్స్ ఏర్పాటు , భక్తులు వేచి ఉండే స్థలాలు, శిబిరాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, పొరగున ఉన్న రాష్ట్రాలు , దేశవ్యాప్తంగా భక్తులు రొట్టెల పండుగకు మతసామరశ్యంగా లక్షల సంఖ్యలో తరలివచ్చే అంశం కావడంతో వానాలు విస్తృతంగా నెల్లూరు నగరం పరిసరప్రాంతాలకు చేరుకొనే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగిన పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్ డీ ఓ పేర్కొన్నారు. భక్తులు తిరుప్రయాణానికి అనుకూలమైన పరిస్థితిని కల్పించి వారికి పార్కింగ్ స్థలాలను కేటాయిస్తోన్నట్లు పేర్కొన్నారు. అన్నీ శాఖల సంయుక్త సహకారంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే వారు బారాషాహిద్ దర్గాకు చేరుకొనే విధంగా ట్రాఫిక్ నియంత్రణ ఉంటుందన్నారు. కీలక రోజుల్లో దర్గా సమీపానికి మాత్రమే వాహనాలు అనుమతి పరిమితమన్నారు. బారాషాహిద్ దర్గా దర్శనం, రొట్టెల మార్పిడి అనంతరం తిరుగుప్రయాణం అయ్యే భక్తులు అనుసంధానంగా సమీపంలోని బీచ్, ఇతర దర్గాలకు వేళ్లే విధంగా పార్కింగ్ సదుపాయం ఉంటుందన్నారు. పోలీసు సిబ్బందితో వారు వివరాలను తెలిపి సమాచారాన్ని తీసుకొని పార్గింగ్ సదుపాయం పొందినట్లు అయితే సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. రొట్టెల పండుగ ఏర్పాటు నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా సాగుతోన్నట్లు పేర్కొన్నారు.
Discussion about this post