అనంతపురం సెబ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాను N.హనుమంతురెడ్డి ఇంట్లో భారీగా డిఫెన్స్ లిక్కర్ పట్టుకున్నారు. సెబ్ అదనపు ఎస్పీ జి. రామకృష్ణ పర్యవేక్షణలో స్థానికశిల్పా లేపాక్షి నగర్ లో జరిగిన ఈ దాడుల్లో అతని వద్ద నుంచి డిఫెన్స్ కు చెందిన 750 ml గల 303 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ చెప్పారు. రిటైర్డ్ అయ్యాక నార్పలలో బట్టల దుకాణం నిర్వహిస్తూ.. భార్యాపిల్లలతో కలసి శిల్పా లేపాక్షినగర్ లో నివాసం ఉంటున్నాడన్నారు. బెంగుళూరులోని ఆర్మీ క్యాంటీన్ లో ఆయన కార్డుతోపాటు తన సహచర రిటైర్డ్ జవాన్ల ద్వారా కొనుగోలు చేసి వాటిని అనంతపురం లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో జిల్లా ఎస్పీకి పక్కా సమాచారం అందడంతో హనుమంతు రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని మీడియా సమావేశంలో SEB అదనపు ఎస్పీ తెలియజేశారు.
Discussion about this post