బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.66,680 వద్ద ట్రేడ్ అయింది.. అంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.61,080 వరకు అవుతుంది. ధర ఇంతలా పెరగడంతో అమ్మకాలు బాగా తగ్గినట్లు బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వెండి కిలో ధర కూడా రూ.73,950కి చేరింది.
అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే వార్తలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడం, కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తితో బంగారం ధర రోజురోజుకు పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతోపాటు, పసిడిపైనా పెట్టుబడులు పెడుతుండటం వల్లే ధరలు ఇంతగా పెరుగుతున్నాయని బులియన్ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఏప్రిల్ మధ్య నుంచి లేకపోవడం వల్ల.. బంగారం, వెండి అమ్మకాలు బాగా తక్కువగా జరుగుతున్నాయని బంగారు ఆభరణాల షోరూంలు చెబుతున్నారయి. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.67,000 వరకు చేరే అవకాశం ఉందని వారు తెలిపారు.
Discussion about this post