సైబర్ నేరాల విషయంలో భారత్.. ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. ‘ప్రపంచ సైబర్నేర సూచీ’ని రూపొందించింది. ఇందులో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. ఈ సర్వే ద్వారా పరిశోధకులు వర్చువల్ ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన నేరాలను పరిగణనలోకి తీసుకొని.. అవి ఎక్కువగా జరుగుతున్న దేశాల పేర్లను ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులకు సూచించారు. పరిశోధకులు గుర్తించిన ప్రధాన విభాగాల్లో మాల్వేర్ వంటి సాంకేతిక ఉత్పత్తులు, సర్వీసులు; సైబర్ దాడులు, రాన్సమ్వేర్ సహా డబ్బు తస్కరణ, డేటా చౌర్యం, హ్యాకింగ్; ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాల తస్కరణ, ముందస్తు చెల్లింపు మోసాలు, అక్రమ వర్చువల్ కరెన్సీతో కూడిన మనీ లాండరింగ్ వంటివి ఉన్నాయి.
Discussion about this post