ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి ప్రారంభం అయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలు ఉండగా, ఖమ్మం నగరంలోనే 36 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు ‘సెంటర్ లొకేటర్ యాప్’ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రథమ సంవత్సరం 18,481 మంది, ద్వితీయ ఏడాది 18,097 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. హాల్ టికెట్లు లేదా ఫొటోలు, ఇతర అంశాల్లో తప్పులు దొర్లినా నంబర్ 99489 04023కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Discussion about this post