లోక్ సభ ఎన్నికలకు ఎలెక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విపి గౌతమ్ అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నాలుగవ విడతలో ఎన్నికలు జరుగుతాయని, ఏప్రిల్ 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలకు, మీటింగులకు పర్మిషన్లు తీసుకోవాలని అన్నారు.
Discussion about this post