భూమికి చందమామ లా శనిగ్రహానికి కూడా అనేక చంద్రులున్నారు. వాటిలో ఒకటైన టైటాన్ పైకి నాసా డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ ను చేపట్టింది. అనేక సహజ వనరులున్న టైటాన్ పైకి నాసా మరో నాలుగేళ్లలో వ్యోమగామ నౌకను పంపనుంది. డ్రాగన్ ఫ్లై విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన శాస్త్ర జ్ఞానాన్ని అందించనుందని నాసా చెబుతోంది.
భూగోళం కాకుండా అనంత విశ్వంలోని టైటాన్ అన్వేషణను, మన శక్తియుక్తులను రోటర్ క్రాఫ్ట్ ద్వారా తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్పేస్ షటిల్ కి సంబంధించిన అన్ని పనులు 2023 నాటికి విజయవంతంగా సాగాయి. మరింత ఆధునీకరణకు బడ్జెట్ కేటాయించాల్సిందిగా నాసా కోరగా గతేడాది నవంబరులో అన్ని వనరులు సమకూర్చారు. దీంతో అనుకున్న సమయానికి టైటాన్ పైకి ఉపగ్రహం వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2025లో విడుదలయ్యే బడ్జెట్ తో సహా దీని ఖర్చు 3.35 బిలియన్ డాలర్లు. దీనిని 2028 జూలైలో ప్రయోగించనున్నారు. 2019లో అంచనా వేసిన ఖర్చుకంటే రెండు రెట్ల ఖర్చు పెరిగింది. అదే ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోవిద్ విజృంభించడం కూడా ఒక కారణం. దీనిని లాంచ్ సమయాన్ని తగ్గించేందుకు భారీ వాహనం కోసం కూడా అదనపు నిధులను అమెరిక ప్రభుత్వం కేటాయించింది.
రోటర్ క్రాఫ్ట్ 2034 నాటికి టైటాన్ పైకి చేరుకొని, 12 ప్రదేశాల్లో పరిశోధనలు జరుపుతుంది. దీంతో మొట్టమొదటి సారి భూమి కాకుండా మిగతా గ్రహాలపై పరిశోధనలు జరిపిన ఘనత అమెరికాకు దక్కుతుంది. రోటర్ క్రాఫ్ట్ లో 8 రోటర్లు ఉంటాయి. అవి కీటకాలను పోలిన డ్రోన్ల మాదిరిగ ఉంటాయి. మేరీలాండ్ లోని Applied Physics Laboratory కి చెందిన జాన్స్ హాప్కిన్స్ నాసా కోసం డ్రాగన్ ఫ్లైను రూపొందించారు.
Discussion about this post