టీడీపిలో టిక్కెట్ లభించని సీనియర్ నేతలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న సీనియర్ నేత కలమట వెంకటరమణను కాదని… జూనియర్ అయిన మామిడి గోవిందరావుకు టిక్కెట్ కేటాయించడంతో ఆ నియోజక వర్గ టిడిపిలో ఆగ్రహజ్వాలలు ఎక్కువయ్యాయి. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో భారీర్యాలీ చేపట్టారు. ర్యాలీలో వేలాది మంది టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియ జేశారు.
Discussion about this post