తెలంగాణ రైతాంగానికి మేలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పనులను నాణ్యతతో చేపట్టిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం కొడకండ్ల మల్లన్న సాగర్ నీటిని కుడవెల్లి వాగులోకి నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.
Discussion about this post