మంగళగిరి అసెంబ్లీ కి వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి, mlc మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఏమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ తరపున మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి నారా లోకేష్ పేరును ఆపార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది.
మంగళగిరి నియోజకవర్గం 1983 వరకు కమ్యూనిస్ట్ లకు పెట్టని కోటగా ఉండేది. ఎన్టీఆర్ రాజకీయ ఆరంగ్రేట్రం తో టీడీపీ అక్కడ వరుసగా 1983,1985 లలో గెలిచింది. అప్పటి నుండి 2024 వరకు, సుమారు 33 ఏళ్లు టీడీపీ ఈ నియోజకవర్గం లో గెలవలేదు. గత ఎన్నికలలో నారా లోకేష్ స్వయంగా పోటీ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. గతం లో గెలిచిన ఆళ్లను, సమన్వయ కర్తగా నియమించిన చిరంజీవిని కూడా కాదని ఎవరూ ఊహించని రీతిగా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య గెలుపుకు పార్టీ గ్రూపులు ఏమేరకు సహకరిస్తాయో వేచిచూడాల్సిందే!
Discussion about this post