షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఔదం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మేందుకు చంద్రబాబు, సోనియాగాంధీ షర్మిలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోనియాతో మాట్లాడి ఏపీకి 6 వేల కోట్ల రూపాయల నిధులు, లక్షా 80 వేల కోట్ల ఉమ్మడి ఆస్తుల వాటా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Discussion about this post