పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తాం..
పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన నేషనల్ పెన్షనర్స్ డే కార్యక్రమానికి తుమ్మల ముఖ్య అతిధిగా విచ్చేసారు. విశ్రాంత ఉద్యోగులకి కావాల్సిన హెల్త్ కార్డుల అంశం .. ఇతర సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరించేందుకు మంత్రి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమాన్ని క్లాసికల్ డాన్స్ తో అలరించిన బాలికను మంత్రి తుమ్మల శాలువాతో సత్కరించారు. విశ్రాంత ఉద్యోగులను ఈ సందర్భంగా ఆయన సత్కరించారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది.2024 క్యాలెండర్లు, డైరీలను ఆయన ఆవిష్కరించారు.
Discussion about this post