పంజాగుట్ట డ్రగ్స్ కేసులో విచారణను నార్కొటిక్స్ బ్యూరో వేగవంతం చేసింది. ఇటీవల రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ తో పట్టుబడ్డ స్టాన్లీ గోవా లోని కోల్వలే జైలు నుంచి ఓక్రాముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోందని కీలక సమాచారం అందించాడు. కోర్టు అనుమతితో గోవాకు వెళ్లిన నార్కొటిక్స్ బృందం జైల్లో ఉన్న ఓక్రాతోపాటు ఫైజర్ ను విచారించి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓక్రా,ఫైజల్ గోవా జైల్ లో ఉండి సెల్ ఫోన్స్ ద్వారా యూరప్ దేశాల నుండి వివిధ రకాల డ్రగ్స్ ను ముంబైకి తెచ్చి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్లు నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది. గోవా కొల్వాలే జైల్లో తనిఖీలు చేసిన గోవా పోలీసులు 16 సెల్ ఫోన్స్ గుర్తించారు.
Discussion about this post