బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ బీజేపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపికి ఓటు వేయాలని కోరారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అన్ని రకాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Discussion about this post