నిజామాబాద్ లో రేయాన్ష్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను రెజ్లర్… ది గ్రేట్ ఖలీ ప్రారంభించారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ అంటూ స్పీచ్ ను ప్రారంభించిన ఆయన గ్రామీణ యువతకు హోటల్ మేనేజ్ మెంట్ తో ఉపాధి దొరుకుతుందన్నారు. నగరంలోని బోర్గంలో రేయాన్ష్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను ప్రిన్సిపాల్ మహేందర్, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ జగన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ,యువకులుకు.. చదువు మధ్యలో మానేసి ఉపాధి దిశగా అడుగులు వేస్తున్న వారికి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. కళాశాల ఆధ్వర్యంలో ట్రైనింగ్ అనంతరం 100 శాతం ప్లేస్మెంట్స్ ఇవ్వడం నిరుద్యోగులకు ఊరటనిస్తుందని ఖలీ అన్నారు.
Discussion about this post