రాగల వారం రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ఆగ్నేయం మీదుగా చురుకుగా కదులుతున్నాయని, దీనిప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో పలు చోట్ల సాధారణ వర్షాలు కూరుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త యం.సునందా పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుందన్నారు. దీని ప్రభావం ఆంద్రప్రదేశ్ పై ఉండబోదని అంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందా.
Discussion about this post