ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై 24 లక్షల జరిమానా విధించారు. లక్నో సూపర్జెయింట్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో… ముంబై ఇండియన్స్లోని 10 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25% విధించగా… కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24 లక్షలు జరిమానాకు గురయ్యాడు.
అంతకుముందు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో..12 లక్షలు జరిమానా విధించగా… ఈ తప్పును రెండవ సారి పునరావృతం చేసినందుకు ఇప్పుడు 24 లక్షలు జరిమానా విధించారు. ఇదే తప్పును హార్దిక్ పాండ్యా మూడోసారి పునరావృతం చేస్తే ఒక మ్యాచ్ నిషేధం తప్పదు. ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ మిస్టేక్ చేసిన పాండ్యా మొత్తం 36 లక్షలు జరిమానా చెల్లించగా… మూడోసారి అదే తప్పు చేస్తే రూ.30 లక్షలు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. దీంతో పాండ్యా తదుపరి మ్యాచులలో స్లో ఓవర్ రేట్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు 20 ఓవర్లను గంట 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకుంటే, ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ నుంచి తగ్గిస్తారు. అలాగే, ఈ తప్పు చేసిన జట్టు కెప్టెన్కు 12 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. అదే తప్పును 2వ సారి పునరావృతం చేస్తే కెప్టె్న్కు రూ.24 లక్షలు జరిమానాతో పాటు అదనంగా ప్లేయింగ్ ఎలెవన్లోని 10 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడుతుంది. మూడోసారి కూడా ఇదే తప్పు పునరావృతమైతే జట్టు కెప్టెన్కు 30 లక్షల జరిమానా విధిస్తారు. ఇది కాకుండా, మూడుసార్లు కమిట్ అయిన కెప్టెన్ ఒక మ్యాచ్ నుంచి నిషేధానికి గురవుతాడు. ప్లేయింగ్ ఎలెవన్లోని 10 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 12 లక్షలు జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Discussion about this post