రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా… జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. ప్రజల కోసం, ప్రజా ప్రభుత్వమైన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తుంటే మంచిని మంచి అని పొగడక పోయినా… మౌనంగా ఉంటే మంచిదని, హుందాతనంగా ఉంటుందని అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు.
Discussion about this post