సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అధికారులను, మంత్రులను కలుస్తున్నారు. ప్రజాభవన్ కు వచ్చేవారిలో డబుల్ బెడ్ రూం లకోసం వచ్చేవారే ఎక్కువ. మహానగరంలో ఇంటి అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నవారంతా డబుల్ బెడ్ రూం ల కోసమే వస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఇళ్లున్న వాళ్లకే డబుల్ బెడ్ రూములు ఇచ్చారని సామాన్యులకు ఎవరికీ ఇల్లు రాలేదని అంబర్ పేట వాస్తవ్యురాలు తెలిపారు. ఈ ప్రభుత్వం ఆదుకుంటుదని వచ్చానన్నారు. పాపిరెడ్డి కాలనీ నుంచి వచ్చిన కళావతి 8 ఏళ్ల క్రితం డబుల్ బెడ్ రూం కు అప్లై చేశానని, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానన్నారు. మారెమ్మ, జరీన, ఈరమ్మ, అంబరపేట నుంచి వచ్చిన విజయలక్ష్మి కూడా డబుల్ బెడ్ రూంల కోసమే వచ్చారు. ఈరమ్మ వంటరి మహిళ ఆమెకు ఇల్లుతోపాటు పింఛన్ కూడా అడుగుతున్నారు. గోపన్నపాలెం తండాకు చెందిన మాధవి సమస్య కూడా డబల్ బెడ్ రూమే..
Discussion about this post