కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా భవనం పనులు మూడు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. విద్యార్థుల ఉన్నత చదువులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ స్థాయి కి పెంచారు కానీ కాంట్రాక్ట్ నిర్లక్షముతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ గీత తెలిపారు. ప్రస్తుతం పాత భవనంలో విద్యాబోధన కొనసాగుతుందని.. తొందరగా నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి అనుమతిస్తే.. విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు.
Discussion about this post