రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం దాదాపూ ఖరారైంది. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పేరును అధిష్టానం అధికారికంగా రెండురోజుల్లో ప్రకటించవచ్చు.
రాహుల్ ఎన్నికల బరిలోకి దిగితే అమేథీలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీపడనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్పై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజక వర్గంలో గెలుపొంది రాహుల్ గాంధీ లోక్సభలోకి అడుగుపెట్టారు.
2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయితే, ఆమె ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు.అమేధీతో పాటు రెండో నియోజక వర్గం ఎంచుకుని రాహుల్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.తెలంగాణ లోని ఖమ్మం నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Discussion about this post