ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ది చెందిన నెల్లూరులోని తల్పగిరి రంగనాథ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత రంగ నాధుని కళ్యాణం కన్నుల పండువగా సాగింది. పూర్వం దండయాత్రల నుంచి ప్రాణత్యాగం చేసి ఉదయ గిరి నుంచి ఉత్సవరులను క్షేత్రానికి చేర్చిన కంటే వంశీయులు భక్తి ప్రపత్తులను చాటుకొన్నారు. అప్పటి రాచరిక పాలకులు వారిని అభినందించి కానుకలను సమర్పిస్తే, వాటిని త్యజించి తాము కన్యాదాతలుగా కొనసాగుతామని కోరారు. అప్పటి నుంచి వారి వంశీయులే సాంప్రదాయ రంగనాథ బ్రహ్మోత్సవ కళ్యాణంలో శాశ్వత ఉభయ కర్తలుగా కొనసాగుతున్నారు. కంటే వారసుల్లో అమెరికా నుంచి వచ్చిన వంశీ క్రిష్ణ మాట్లాడుతూ పూర్వీకులు భగవంతుని కోసం చేసిన త్యాగఫలితానికి తాము ఉభకర్తలుగా కొనసాగుతున్నామన్నారు.
Discussion about this post