బంగాళా ఖతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవెత్తున ఎగిరి పడుతున్నాయి. ఉప్పాడ, కొత్తపట్నం, మాయపట్నం, సూరాడపేట, కొనపాపపేట, సుబ్బంపేట, రంగంపేట, పాతబజార్ తదితర చోట్ల సముద్రం ముందుకు తోసుకురాగా… ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. తుఫాన్ వచ్చినప్పుడల్లా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నామని, శాశ్వత పరిష్కారంగా రక్షణ గోడ నిర్మించి… సుదూర ప్రాంతాల్లో నివాసాలకు అనువుగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు కోరుతున్నారు.
Discussion about this post