తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద క్రమేపి పెరగడంతో భద్రాచలం నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక కూడా దాటింది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. బాధిత గ్రామాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Discussion about this post